కాకినాడ జిల్లా పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. కొందరికి డబ్బిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు.
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. కొందరికి డబ్బిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు.
మరోవైపు యు.కొత్తపల్లి మండలం కొండవరంలో ఓటర్లు రోడ్డెక్కారు. ప్రమాణం చేస్తేనే డబ్బులిస్తామని వైకాపా నాయకులు చెప్పడంతో ఎదురు తిరిగి ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాణం చేయబోమని తేల్చిచెప్పారు. అభ్యర్థుల నుంచి తమ పేరిట డబ్బు తీసుకుని పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.
Also read
- ఒత్తిడి భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- తెల్లారితే భార్య సీమంతం.. అంతలోనే హత్య
- ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
- నేటి జాతకములు 4 జూలై, 2026
- సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కొనసాగుతున్న విచారణ.. ఇదిగో లేటెస్ట్ అప్డేట్!





