విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
విశాఖపట్నం: విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూపన్లు ఇచ్చారు.. తమకు డబ్బులు అందలేదంటూ ఓటర్లు ఎంవీవీ ఇంటిని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లిఫ్ట్ ఆపేసి, గేటుకు తాళాలు వేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పి పంపించేశారు.
గత రెండు నెలలుగా ఎంవీవీ.. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వివిధ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. సభలు, సమావేశాల పేరుతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారు. దీంతో భారీగానే తాయిలాలు అందుతాయని స్థానికులు ఆశించారు. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. కూపన్లు ఇచ్చినప్పటికీ డబ్బులు అందలేదని కొందరు నేరుగా ఆయన ఇంటికే వచ్చేశారు.
Also read
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..





