విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
విశాఖపట్నం: విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూపన్లు ఇచ్చారు.. తమకు డబ్బులు అందలేదంటూ ఓటర్లు ఎంవీవీ ఇంటిని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లిఫ్ట్ ఆపేసి, గేటుకు తాళాలు వేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పి పంపించేశారు.
గత రెండు నెలలుగా ఎంవీవీ.. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వివిధ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. సభలు, సమావేశాల పేరుతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారు. దీంతో భారీగానే తాయిలాలు అందుతాయని స్థానికులు ఆశించారు. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. కూపన్లు ఇచ్చినప్పటికీ డబ్బులు అందలేదని కొందరు నేరుగా ఆయన ఇంటికే వచ్చేశారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





