విశాఖపట్నం : కేజీహెచ్ సర్జరీ విభాగంలో జూనియర్ వైద్యుడు డాక్టర్ బొప్పరాజు శశినాథ్ (23) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెండు రోజులుగా ఆహారం సరిగా తీసుకోలేదని, వృత్తిపరమైన ఒత్తిడి భరించలేకపోతున్నట్లు తనకు ఫోన్ చేసి చెప్పాడని శశినాథ్ తల్లి భవాని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఘటనపై విశాఖ వన్టేన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, వైద్యకళాశాల వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖ శంకరమఠం ప్రాంతానికి చెందిన శశినాథ్ రెండు నెలల క్రితమే ఏఎంసీ సర్జరీ విభాగంలో మొదటి ఏడాది పీజీ కోర్సులో చేరారు. సోమవారం రాత్రి 10.30 సమయంలో విధినిర్వహణలో ఉండగా బాత్రూంకు వెళ్తున్నట్లు సిబ్బందికి చెప్పారు. అరగంటైనా రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా శశినాథ్ రెండు చేతుల మణికట్ల వద్ద రక్తస్రావం జరుగుతూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించారు. ఆత్మహత్యాయత్నానికి కారణం తెలియలేదని, కేసు విచారణ దశలో ఉందని వన్లైన్ సీఐ పూడి వరప్రసాద్ తెలిపారు. శశినాథ్కు కౌన్సెలింగ్ ఇస్తున్నామని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి తెలిపారు.
Also read
- Hanuman Jayanti: హనుమాన్ జయంతి మంగళవారమే..! ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!
- Amavasya 2026: అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?
- Hanuman Jayanti Special: ఆంజనేయుడికి తమలపాకుల ఇష్టం వెనుక కథ ఏమిటి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఆమె రాత్రిపూట రేటు మాట్లాడుకుని పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్తుంది.. కాసేపటికి..





