ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. పార్థసారథి నగర్లో ప్రధాన రహదారి పక్కన ఐడీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంను ఎత్తుకెళ్లారు.
తెల్లవారుజామున బొలెరో వాహనంలో వచ్చిన ముగ్గురు దొంగలు మాస్కులు ధరించి ఏటీఎంలోకి చొరబడ్డారు.
రాడ్లతో దానిని పెకిలించడానికి ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో తాళ్లు కట్టి బొలెరో వాహనంతో గట్టిగా లాగారు. ఎటీఎంను వాహనంలోకి ఎక్కించి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలు వాహనంలో బత్తలపల్లి వైపు వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆ మార్గంలో తనిఖీలు చేపట్టారు.
Also read
- Kumkuma : కుంకుమ కింద పడితే అశుభం కాదా?
- జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఏమవుతుంది? శుభం లేదా అశుభం.. షాకింగ్ నిజాలు!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఈ అధిక మాసంలో ఒక్క శ్లోకం చదివితే చాలు.. 33 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యంతో పాటు ఎన్నో లాభాలు!
- ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు





