పామర్రులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. భర్త, అతడి సోదరులను అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా, మే 5: పామర్రులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. భర్త, అతడి సోదరులను అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. నందివాడకు చెందిన మురళీకృష్ణకు 13 ఏళ్ల క్రితం లక్ష్మీ ప్రసన్నతో పెళ్లయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా లక్ష్మీ ప్రసన్న 6 నెలల నుంచి దూరంగా ఉంటోంది. పామర్రులో ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ఆదివారం భర్త మురళీ కృష్ణ, అతడి సోదరులు ఆమె దగ్గరకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
ఆ గొడవ చిలికి, చిలికి గాలి వానలా మారింది. లక్ష్మీ ప్రసన్నపై భర్త, అతడి సోదరులు ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమె చనిపోయిందని ధ్రువీకరించుకున్నాక నిందితులు అక్కడినుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందం 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించింది.
Also read
- గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు.. హీలియం గ్యాస్ పీల్చుకుని చార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్..
- అందగా ఉంటుందని.. అమాయకరాలు అనుకునేరు..! విశాఖ రాథోడ్ మామూల్ది కాదు..
- ప్రేమ పేరుతో దారుణం.. బస్సులో నుంచి దింపి పొలాల్లోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యం..!
- Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
- Hyderabad: హలో.. నేను అనన్య కులకర్ణి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్కు సాఫ్ట్గా లైన్ కలిపింది.. కట్ చేస్తే..





