వైకాపా కార్యకర్త దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
దుగ్గిరాల: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తెదేపా కార్యకర్త ఖాసీంపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త క్రికెట్ బ్యాట్తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఖాసీంను కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీ గెలిచిందన్న సంతోషంతో సంబరాలకు సిద్ధమవుతున్న ఖాసీంపై కమల్ బ్యాట్తో దాడి చేశాడని మృతుని బంధువులు తెలిపారు. వైకాపా ఓటమిని తట్టుకోలేక నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితులు వెల్లడించారు. కమల్పై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బాధితులు హెచ్చరించారు.
Also read
- పరారీలో అఘోరి, శ్రీ వర్షిణి.. ఫోన్లు స్విచ్చాఫ్- ఆ భయంతోనే జంప్!
- విహారయాత్రలో విషాదం – విద్యార్ధి మృతి
- Wife Murder: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!
- Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !
- Khammam Crime: ఖమ్మంలో కసాయి కోడలు.. మామ కంట్లో కారం చల్లి.. ఏం చేసిందంటే!