SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

AP Elections: తంబళ్లపల్లి నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత




ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థి ద్వారాకనాథ రెడ్డి నామినేషన్ వేశారు. అయితే ఆ సమయంలో పరిమితికి మించి ఆ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి.

చిత్తూరు, ఏప్రిల్ 19: ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థి ద్వారాకనాథ రెడ్డి నామినేషన్ వేశారు. అయితే ఆ సమయంలో పరిమితికి మించి ఆ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి. కానీ నిబంధనలు ప్రకారం అంత మంది ఉండకూడదంటూ.. పోలీసులు వారిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు.

కానీ శుక్రవారం టీడీపీ అభ్యర్థి దాసరి జయచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు ఆర్వో కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ క్రమంలో ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలోనికి భారీగా టీడీపీ శ్రేణులు చొచ్చుకు వచ్చాయి. వారిని నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జి చేశారు.

అయితే ఈ లాఠీచార్జి జరుగుతున్న సమయంలో ఆగంతకులు ఆ ప్రాంతలో రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ట్రైనీ డిఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. దాంతో కూటమి అభ్యర్థి టిడిపి నాయకుడు దాసరి జయచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

Also read

Related posts

Share this