తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో టీడీపి నాయకుడి హత్య జరిగింది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పన్నాగం పన్నారు.
వాహనంతో ఢీకొట్టి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పన్నాగం మృతదేహం వాహనంలో ఇరుక్కోవడంతో అడ్డం తిరిగిన కథ
నాయుడుపేట పట్టణం, : తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో టీడీపీ నాయకుడి హత్య జరిగింది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పన్నాగం పన్నారు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు.. ఆదివారం రాత్రి ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన టీడీపి నాయకుడు ఆళ్ల గురుమూర్తి (52), మరో వ్యక్తి అనీల్రెడ్డి ద్విచక్ర వాహనంపై నాయుడుపేట నుంచి స్వగ్రామం అత్తివరానికి వెళ్తున్నారు. వీరి వాహనం ద్వారకాపురం సమీపానికి రాగానే వెనుక నుంచి టాటాఏస్ వాహనంతో ఢీకొట్టారు. వెనుక కూర్చొన్న గురుమూర్తి టాటాఏస్ వాహనంలో ఇరుక్కుపోవడంతో అర కి.మీ. మేర లాక్కెళ్లారు. వాహనం ఇక ముందుకు కదలకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. గురుమూర్తి మృతి చెందగా, అనీల్రెడ్డి గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వాహనం నుంచి గురుమూర్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టాటాఏస్ వాహన డ్రైవరు, మరో వ్యక్తి సోమవారం ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయినట్లు సమాచారం. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
కాపు కాసి మరీ
నిందితులిద్దరూ పాలచ్చూరు రోడ్డుపై వాహనంతో కాపుకాశారు. ద్విచక్ర వాహనం వెళ్లాక లైట్లు ఆపేసి, వెంబడించి ఢీకొట్టారు. ఢీకొట్టి వెళ్లిపోవాలనుకోగా.. వాహనంలో మృతదేహం ఇరుక్కోవడంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ.. ఇది హత్యగానే భావిస్తున్నామన్నారు. ఆసుపత్రి వద్దకు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, కార్యకర్తలు చేరుకున్నారు.
కంపెనీల్లో పనులే హత్యకు దారి తీశాయి: గురుతేజ, మృతుడి కుమారుడు
అత్తివరంలోని కంపెనీలకు నీటి సరఫరా, ఇతర పనుల విషయంలో మాపై తెదేపాకే చెందిన ప్రత్యర్థి వర్గం వారు గొడవకు దిగారు. మేం ముందుగా పనులు పూర్తి చేయడంతో కంపెనీ వారు ఎక్కువ పనులు మాకు అప్పగించారు. దీంతో ప్రత్యర్థి వర్గీయులు నిత్యం గొడవలకు ఉసిగొల్పేవారు. మా కుటుంబంపై కొన్నేళ్లుగా పలు కేసులు పెట్టించి, పది ఎకరాల నిమ్మ చెట్లు దున్నేశారు. మేం మొదటి నుంచి టీడీపి సానుభూతిపరులం. ప్రత్యర్థి వర్గీయులు ఇబ్బంది పెట్టడంతో 2019లో వైసీపీ లో చేరాం. ఈ ఎన్నికలకు ముందు టీడీపి లోకి వచ్చేశాం. 18 రోజుల క్రితం కంపెనీలకు నీరు తరలించే విషయంలో మా వాహనాలు ఆపేయడంతో గొడవ జరిగింది. ఆ రోజే మా ప్రత్యర్థులు మా నాన్నను, నన్ను చంపేస్తామన్నారు. వాళ్లే పథకం ప్రచారం చంపేశారు. మాకు న్యాయం జరగాలి’ అని మృతుడి కుమారుడు గురుతేజ అన్నారు.
Also read
- నేటి జాతకములు…22 మే, 2025
- Garuda Purana: అల్లుడితో సంబంధం పెట్టుకునే అత్తకు గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్షలు విధిస్తారంటే
- ‘నీ బిడ్డనిచ్చి పెళ్లి చెయ్’ – సహజీవనం చేసిన మహిళకు వ్యక్తి బెదిరింపులు
- కోర్టు సినిమా తరహాలో కడపలో రియల్ సీన్ సంచలనం.. పోలీసుల సమక్షంలోనే..
- Vizianagaram Case: విజయనగరం టెర్రర్ కేసులో మరిన్ని సంచలనాలు