చికిత్స కోసం వచ్చిన మహిళతో అసభ్య ప్రవర్తన
ఫిజియోథెరపిస్ట్ప శంకర్పల్లి పోలీస్టేషన్ లో కేసు
హైదరాబాద్, బంజారాహిల్స్: చికిత్స కోసం వచ్చిన ఓ మహిళను లైగింక వేధింపులకు గురిచేసిన ఓ ఫిజియోథెరపిస్ట్ప శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే జీరో ఎన్ఐఆర్ నమోదైన కేసు జూబ్లీహిల్స్ పోలీస్టేషన్కు బదిలీ అయింది. ఓ మహిళ భుజం నొప్పితో 2025 ఆగస్టు, సెప్టెంబర్ మోకిలాలోని 24 ఫిజియోథెరపీ క్లినిక్లో చేరింది.
జూబ్లీహిల్స్ రోడ్ నెం-35కు చెందిన ఫిజెయోథెరపిస్ట్ రేలంగి సునీల్ కుమార్ ట్రీట్మెంట్ పేరిట ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమె అనుమతిలేకుండా ముద్దు పెట్టుకున్నాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు నిలదీయగా క్షమాపణ చెప్పాడు. నిందితుడి ప్రవర్తనతో డిప్రెషన్కు గురైన బాధితురాలు కౌన్సెలింగ్ సైతం తీసుకుంది. నిందితుడు జూబ్లీహిల్స్లో అనుమతులు లేకుండానే క్లినిక్ నడుపుతున్నాడని, అధికారుల తనిఖీల సమాచారం తెలియడంతో రాత్రికిరాత్రే పరికరాలు తరలించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- మునుకుంట్ల ప్రేమికుల మృతి ఘటనలో ట్విస్ట్..!
- గుంటూరులో నడిరోడ్డుపై.. మహిళను వివస్త్రను చేసి దాడి
- నిద్రిస్తున్న కొడుకు తలపై కర్రతో కొట్టి హతమార్చిన తండ్రి
- 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీటీవీ చూసి ఆగ్రహించిన స్థానికుల దాడి, అనుమానితుడు మృతి
- టీ తాగేందుకు రూ.20 ఇవ్వలేదని తలా మొండెం వేరు చేశాడు!





