తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో సోమవారం చోటు చేసుకుంది.
చందుర్తి, : తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జటోతు తిరుపతి (43) తాగుడుకు బానిసయ్యారు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవారు. మూడు రోజుల క్రితం ఇంట్లో ఉన్న రూ.పది వేలు తీసుకెళ్లారు. సోమవారం వచ్చి మళ్లీ డబ్బులు కావాలని భార్య అమీనాతో గొడవకు దిగారు. ఆమె ఈ విషయాన్ని తమ కుమారుడు రాజేశ్కు ఫోన్లో తెలిపింది. కారులో వచ్చిన రాజేశ్.. ఇంటి ముందు తల్లితో గొడవ పడుతున్న తండ్రిని కారుతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన తిరుపతిని స్థానికులు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ మేరకు మృతుడి అన్న రాములు నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
మరోవైపు తిరుపతిపై గతంలో చందుర్తి ఠాణాలో మూడు కేసులు ఉన్నట్లు తెలిసింది.
Also read
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..





