సూపర్ భాజారు (కొత్తగూడెం):అత్తింటి వేధింపులతో ఉపాధ్యాయురాలు భూక్య కవిత(36) ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వన్డే టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. భూక్య కవిత భద్రాచలంలో, ఆమె భర్త నాగేశ్వరరావు బూర్గంపాడులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దంపతులకు 5, 6 తరగతులు చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, తరచూ భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఘర్షణ జరిగింది. భర్త బయటకు వెళ్లివచ్చేసరికి తలుపు గడియపెట్టి ఉంది. కిటికీలో నుంచి చూడగా కవిత ఉరి వేసుకుని ఉండటంతో 108కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చాక తలుపు పగులగొట్టి ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. భర్త, అత్త, మామ, బావ, తోటి కోడలు, భర్త మేనకోడలు కలిసి నాగేశ్వరరావుకు వేరే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఆత్మహత్యకు ప్రేరేపించారని మృతురాలి తల్లి ఫిర్యాదు చేయగా, వన్డేన్ ఎస్ఐ విజయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





