ఏపీ తెనాలీలో పోలీసులు యువకులను నడిరోడ్డుపై చితకబాదారు. గంజాయి మత్తులో తనపై దాడిచేశారనే కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు లంచం అడిగితే ఇవ్వనందుకే తప్పుడు కేసు పెట్టి చావగొట్టారని బాధితులు చెబుతున్నారు. వీడియో వైరల్ అవుతోంది.
AP News: ఏపీలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై చితకబాదారు. గంజాయి మత్తులో తనపై దాడిచేశారనే కానిస్టేబుల్పై ఫిర్యాదుతో ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు లంచం అడిగితే ఇవ్వనందుకు తప్పుడు కేసు పెట్టి చావగొట్టారని బాధితులు చెబుతున్నారు
ఈ మేరకు దళితులు, మైనారిటీలే టార్గెట్ గా పోలీసులు దాడులు చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కన్నా చిరంజీవి 2 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడానికి సంబంధం లేదని వాపోతున్నారు. అమాయక దళిత, మైనారిటీల యువకులపై తెనాలి ఐతానగర్ నడిరోడ్డులో అందరూ చూస్తుండగా పోలీసుల జులుం ప్రదర్శించారని మండిపడుతున్నారు. తెనాలి 2 టౌన్ రాముల నాయక్, 3 టౌన్ CI రమేష్ బాబుల దాష్టీకం ఏమిటని ఆవేదన చెందుతున్నారు.
లంచం ఇవ్వనందుకే దాడి..
ఈ మేరకు ఇటీవల కన్నా చిరంజీవి 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను ఏదో చిన్న విషయంలో లంచం ఇవ్వమని బెదిరించాడు. లేకపోతే అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని 3 టౌన్ CI రమేష్ బాబు చెప్పమన్నారని వారిని భయపెట్టాడు. వాళ్ళు డబ్బులు ఇవ్వమని తిరస్కరించగా అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి.. అతని అవినీతి బయటకు వస్తుందేమోనని ముందుగానే వెళ్లి యువకులపై అబద్ధపు కేసు పెట్టాడు. 2 టౌన్ కు సంబంధం లేని 3 టౌన్ కానిస్టేబుల్స్ బెదిరింపులకు గురిచేయడం దారుణం అంటున్నారు.
బాధితులు చెంచుపేటకు చెందిన చేబ్రోలు జాన్ విక్టర్ (25) దళితుడు, ఐతానగర్ కు చెందిన దోమా రాకేష్ (25) దళితుడు, తిప్పర్ల బజార్ కు చెందిన షేక్ బాబులాల్ (21) సంవత్సరాలు ముస్లిమ్. ఈ ముగ్గురిని రోజులు వారి వద్దే ఉంచుకుని చిత్రహింసలకు గురిచేశారు. వీధి వీదులు తిప్పుతూ తెనాలి, ఐతానగర్ ప్రధాన కూడళ్ళలో రోడ్డులపై కూర్చోబెట్టి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూస్తుండంగా విచక్షణారహితంగా దాడిచేయడం అమానుషం. తెనాలి 2 టౌన్ CI రాములు నాయక్, 3 టౌన్ CI రమేష్ బాబులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను బాధిత బంధువులు కోరారు.
నేరం చేస్తే న్యాయస్థానాలకు అప్పచెప్పాలి. కానీ ఇంత క్రూరంగా ప్రజలు చూస్తూ ఉండగా కొట్టాల్సిన అవసరం లేదు. గౌరవ న్యాయస్థానాలు ముద్దాయిలను ఈ విధంగా శిక్షించవద్దు. ఈ విధంగా కొట్టవద్దు. కొట్టే హక్కు మీకు లేదు అని చెప్పినా పెడచెవిన పెట్టి ఈ విధంగా ప్రజలపై తెనాలి పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ విషయం మీద తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడితే ఇంకా వారికి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి మాట్లాడినా మీపైన కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడా కనబడడం లేదని ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..