ప్రసవం కోసం అస్పత్రికొచ్చింది ఓ మహిళ.. పాపం.! డాక్టర్లు చేసిన పనికి తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఈ ఘటన తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. మరి డాక్టర్లు ఏం చేశారు.. చివరికి ఏం జరిగిందో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
హనుమకొండ జిల్లా కమలాపూర్ ప్రభుత్వాస్పత్రిలో ఘోరం చోటు చేసుకుంది. ఓ మహిళకు ప్రసవం చేసే సమయంలో ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం తిరుమల అనే మహిళకు సిజేరియన్ చేసి ప్రసవం చేశారు కమలాపూర్ ప్రభుత్వాస్పత్రి వైద్యులు. ఆ సమయంలో కడుపులో కాటన్ క్లాత్ వదిలేసి కుట్లు వేశారు. దీంతో సదరు మహిళ తీవ్ర అనారోగ్యానికి లోనైంది. విపరీతమైన కడుపునొప్పితో ఇబ్బందులు పడింది. దీంతో చేసేదేమీలేక మరోసారి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కాస్త బయటపడింది.
ఇక అది కప్పిపుచ్చుకునేందుకు.. సదరు మహిళ ఆస్పత్రిలో రీ-అడ్మిట్ అయిన సమయంలో విధుల్లో ఉన్న నర్సుకు ఫోన్ చేసి.. ఆ క్లాత్ ఎలా తీయాలో వైద్యురాలు వివరించింది. ఇక దాన్ని తీసే క్రమంలో బాలింతకు వేసిన కుట్లు ఊడిపోవడంతో.. ఆమెకు రక్తస్రావం అవ్వడమే కాదు.. తీవ్రంగా ఇబ్బంది పడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకొని బాధితులకు, వైద్యులకు మధ్య సంధి కుదిర్చి పంపించారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





