జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఇదే పోలీస్ స్టేషన్లో వి.రామయ్య అనే ఎఎస్ఐ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సదరు బాధిత మహిళా బాధితురాలితో పరిచయం ఏర్పడింది. బాధితురాలికి తగిన న్యాయం చేస్తానని బాధిత మహిళను నమ్మించి ఆమెను లోబర్చుకున్నాడు. సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకుని తరుచు కాల్ చేస్తూ ముగ్గులోకి దింపాడు.
ఆమెతో ఎఎస్ఐ రామయ్య వివాహేతర సంబంధం కొనసాగించారు. అంతేకాదు ఏకంగా తానూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరు మహిళను పిలిపించుకుని బందోబస్తు నిర్వహించే పరిసర ప్రాంతాల్లో మహిళతో ఏకాంతంగా గడిపి అధికారులకు దొరికిపోయాడు. ఈ ఎఎస్ఐ రాసలీల భాగవతం స్థానిక సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగంతో సదరు ఎఎస్ఐ భాగోతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో విచారణ జరిపిన పోలీస్ అధికారులు ఎఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో