పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు.
రెంటచింతల: పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత.. రెగ్యులర్ పోలింగ్ ప్రారంభిస్తున్న క్రమంలో వైకాపా ఏజెంట్లు తెదేపా ఏజెంట్లపై దాడి చేశారు.
ఈసీ ఆగ్రహం
పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
Also read
- ఆలయంలోని మహిళల బాత్రూంలో చొరబడి రహస్య వీడియోలు రికార్డ్
- Andhra: ఎంతపని చేశావ్ మానస.. బాయ్ఫ్రెండ్ చెప్పినట్లు చేసింది.. చివరకు
- అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా సెక్రటేరియట్ లోపలికి వెళ్లాడు.. సీన్ కట్ చేస్తే..
- తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి.. ఎందుకంటే..
- నేటి జాతకములు..30 ఏప్రిల్, 2026





