స్నేహితురాళ్ల అశ్లీల ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి టౌన్ ప్రాంతానికి చెందిన మకరజ్యోతి (39) అనే మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమె, పాలయంకోట్టైలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ సమయంలో కోయంబత్తూరుకు చెందిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.
ఈ క్రమంలో హాస్టల్లో తనతో పాటు ఉంటున్న ఇతర మహిళల రోజూవారి కార్యకలాపాలను వారికి తెలియకుండానే మకరజ్యోతి సెల్ఫోన్లో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా తీసిన అశ్లీల చిత్రాలను ఆమె కోయంబత్తూరులో ఉన్న తన ప్రియుడికి పంపుతున్నట్టు తెలిసింది. హాస్టల్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహిళా పోలీసులు విచారణ చేశారు. విచారణలో తోటి మహిళలను అశ్లీలంగా ఫొటోలు తీసినట్లు నిర్ధారణ కావడంతో, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
-చెన్నై
Also read
- పాదరస శివలింగ పూజ చేస్తే 48 రోజుల్లో కష్టాలు దూరం.. శివుడి అపార కటాక్షం మీ సొంతం!
- పెళ్లిలో వధువు ఎప్పుడూ ఎడమ వైపునే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- నేటి జాతకములు…29 మే, 2026
- పానీపూరి లవర్స్కు షాక్.. ఒకేసారి 15 మందికి తీవ్ర అస్వస్థత! ఏం జరిగిందంటే
- బంగారం దొరుతుందని కొండల్లో తవ్వకాలు.. అక్కడికెళ్లి చూసిన పోలీసులకు షాకింగ్ సీన్..!





