స్నేహితురాళ్ల అశ్లీల ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి టౌన్ ప్రాంతానికి చెందిన మకరజ్యోతి (39) అనే మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమె, పాలయంకోట్టైలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ సమయంలో కోయంబత్తూరుకు చెందిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.
ఈ క్రమంలో హాస్టల్లో తనతో పాటు ఉంటున్న ఇతర మహిళల రోజూవారి కార్యకలాపాలను వారికి తెలియకుండానే మకరజ్యోతి సెల్ఫోన్లో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా తీసిన అశ్లీల చిత్రాలను ఆమె కోయంబత్తూరులో ఉన్న తన ప్రియుడికి పంపుతున్నట్టు తెలిసింది. హాస్టల్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహిళా పోలీసులు విచారణ చేశారు. విచారణలో తోటి మహిళలను అశ్లీలంగా ఫొటోలు తీసినట్లు నిర్ధారణ కావడంతో, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
-చెన్నై
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




