విశ్రాంత ఉపాధ్యాయుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇనకుదురుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
మచిలీపట్నం : విశ్రాంత ఉపాధ్యాయుడు
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇనకుదురు పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిరు వ్యాపారం చేసుకొనే ఓ వ్యక్తి తన వ్యాపార అవసరాల కోసం బుట్టాయిపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి నట దేవేంద్రరావు వద్ద వడ్డీకి నగదు తీసుకుంటుంటాడు. వడ్డీ వసూళ్ల పేరుతో దేవేంద్రరావు అతని ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ నెల 17న నగదు తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లిన దేవేంద్రరావు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పదో తరగతి పాసైన అతని కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించి విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మౌనంగా ఉంటూ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించింది. నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్లో మొదలైన బ్లాక్బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు