విశ్రాంత ఉపాధ్యాయుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇనకుదురుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
మచిలీపట్నం : విశ్రాంత ఉపాధ్యాయుడు
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇనకుదురు పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిరు వ్యాపారం చేసుకొనే ఓ వ్యక్తి తన వ్యాపార అవసరాల కోసం బుట్టాయిపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి నట దేవేంద్రరావు వద్ద వడ్డీకి నగదు తీసుకుంటుంటాడు. వడ్డీ వసూళ్ల పేరుతో దేవేంద్రరావు అతని ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ నెల 17న నగదు తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లిన దేవేంద్రరావు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పదో తరగతి పాసైన అతని కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించి విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మౌనంగా ఉంటూ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించింది. నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





