విశ్రాంత ఉపాధ్యాయుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇనకుదురుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
మచిలీపట్నం : విశ్రాంత ఉపాధ్యాయుడు
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇనకుదురు పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిరు వ్యాపారం చేసుకొనే ఓ వ్యక్తి తన వ్యాపార అవసరాల కోసం బుట్టాయిపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి నట దేవేంద్రరావు వద్ద వడ్డీకి నగదు తీసుకుంటుంటాడు. వడ్డీ వసూళ్ల పేరుతో దేవేంద్రరావు అతని ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ నెల 17న నగదు తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లిన దేవేంద్రరావు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పదో తరగతి పాసైన అతని కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించి విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మౌనంగా ఉంటూ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించింది. నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!