పులివెందుల, సింహాద్రిపురం, : మద్యం మత్తులో ఓ యువకుడు మరో వ్యక్తి చెవి కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండల పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రావులకొలను గ్రామానికి చెందిన వై.మౌనీశ్వరరెడ్డి, కె. రాజశేఖర్రెడ్డి కలిసి మద్యం తాగుతూ ఉండగా.. మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రాజశేఖర్రెడ్డి.. మౌనీశ్వరరెడ్డి చెవి కొరకడంతో పాటు రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పులివెందుల గ్రామీణ సీఐ రమణ తెలిపారు.
Also Read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





