పులివెందుల, సింహాద్రిపురం, : మద్యం మత్తులో ఓ యువకుడు మరో వ్యక్తి చెవి కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండల పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రావులకొలను గ్రామానికి చెందిన వై.మౌనీశ్వరరెడ్డి, కె. రాజశేఖర్రెడ్డి కలిసి మద్యం తాగుతూ ఉండగా.. మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రాజశేఖర్రెడ్డి.. మౌనీశ్వరరెడ్డి చెవి కొరకడంతో పాటు రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పులివెందుల గ్రామీణ సీఐ రమణ తెలిపారు.
Also Read
- నేటి జాతకములు..21 మార్చి, 2026
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం





