పులివెందుల, సింహాద్రిపురం, : మద్యం మత్తులో ఓ యువకుడు మరో వ్యక్తి చెవి కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండల పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రావులకొలను గ్రామానికి చెందిన వై.మౌనీశ్వరరెడ్డి, కె. రాజశేఖర్రెడ్డి కలిసి మద్యం తాగుతూ ఉండగా.. మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రాజశేఖర్రెడ్డి.. మౌనీశ్వరరెడ్డి చెవి కొరకడంతో పాటు రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పులివెందుల గ్రామీణ సీఐ రమణ తెలిపారు.
Also Read
- కుమారుడిపై పెట్రోల్ పోసి, తానూ నిప్పంటించుకున్న తల్లి
- దేవాలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీలు దేవాలయ ఔన్నత్యాన్ని పెంచే విధంగా పనిచేయాలి….
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?
- Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్హ్యాండెడ్గా దొరికిన తహశీల్దార్..
- మియాపూర్ భర్త మిస్సింగ్ డ్రామాలో ట్విస్ట్.. ప్రియుడితో కలిసి చంపి, పాతేసింది భయ్యా!





