పులివెందుల, సింహాద్రిపురం, : మద్యం మత్తులో ఓ యువకుడు మరో వ్యక్తి చెవి కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండల పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రావులకొలను గ్రామానికి చెందిన వై.మౌనీశ్వరరెడ్డి, కె. రాజశేఖర్రెడ్డి కలిసి మద్యం తాగుతూ ఉండగా.. మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రాజశేఖర్రెడ్డి.. మౌనీశ్వరరెడ్డి చెవి కొరకడంతో పాటు రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పులివెందుల గ్రామీణ సీఐ రమణ తెలిపారు.
Also Read
- Weekly Horoscope: ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!
- యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
- విశాఖ షీలానగర్లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..





