గుంటూరు: ఓ కేసులో పోలీసులు స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారంటూ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తిరుపతమ్మ అనే మహిళ భర్తతో కలిసి తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తోంది. అపార్ట్మెంట్లోని ఓ మహిళ.. బంగారం అడిగి తీసుకొని తిరుపతమ్మ తిరిగి ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తిరుపతమ్మను పోలీసులు విచారణకు పిలిచారు. అపార్ట్మెంట్లోని మహిళ తనకు బంగారం ఇచ్చానని తప్పుడు ఫిర్యాదు చేసిందని, స్టేషన్కు పిలిపించి పోలీసుల వేధిస్తున్నారంటూ శనివారం సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందింది.
Also read
- Garuda Purana: కుమారుడు లేకపోతే శ్రాద్ధ కర్మలు ఎవరు చేయాలి? కుమార్తెకు హక్కు ఉందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఇంటి నుంచి పిలిచి.. వెంటాడి వేటాడారు.. సుహాస్ మృతి కేసులో వెలుగులోకి భయంకర నిజాలు..!
- నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!
- ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు.. తెల్లారేసరికల్లా బూడిద.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్





