గుంటూరు: ఓ కేసులో పోలీసులు స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారంటూ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తిరుపతమ్మ అనే మహిళ భర్తతో కలిసి తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తోంది. అపార్ట్మెంట్లోని ఓ మహిళ.. బంగారం అడిగి తీసుకొని తిరుపతమ్మ తిరిగి ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తిరుపతమ్మను పోలీసులు విచారణకు పిలిచారు. అపార్ట్మెంట్లోని మహిళ తనకు బంగారం ఇచ్చానని తప్పుడు ఫిర్యాదు చేసిందని, స్టేషన్కు పిలిపించి పోలీసుల వేధిస్తున్నారంటూ శనివారం సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందింది.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




