గుంటూరు: ఓ కేసులో పోలీసులు స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారంటూ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తిరుపతమ్మ అనే మహిళ భర్తతో కలిసి తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తోంది. అపార్ట్మెంట్లోని ఓ మహిళ.. బంగారం అడిగి తీసుకొని తిరుపతమ్మ తిరిగి ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తిరుపతమ్మను పోలీసులు విచారణకు పిలిచారు. అపార్ట్మెంట్లోని మహిళ తనకు బంగారం ఇచ్చానని తప్పుడు ఫిర్యాదు చేసిందని, స్టేషన్కు పిలిపించి పోలీసుల వేధిస్తున్నారంటూ శనివారం సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందింది.
Also read
- పోలీసు స్టేషన్ లో రెండు వర్గాల ఘర్షణ
- నల్లగా ఉన్నావు.. అదనపు కట్నం తీసుకురా..!
- Telangana : లవర్ చింటూ కోసం.. కట్టుకున్న భర్తను JCBతో లేపేసింది!
- మంటల్లో కాలి భర్త మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో భార్య..రెండు గంటల్లో రెండు ప్రాణాలు
- పోలీసులు వేధిస్తున్నారు.. సెల్ఫీ వీడియో తీసుకొని మహిళ ఆత్మహత్య





