జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోనే భార్య మృతిచెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. పొలం దగ్గర పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలంటుకొని భర్త మృతిచెందగా జీవిత భాగస్వామి మరణవార్త భార్య గుండెపోటుతో కుప్పకూలిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో జరిగింది. ఒకేరోజు గంటల వ్యవధిలో దంపతులిద్దరు చనిపోవడం రేపాకపల్లిలో విషాదఛాయలు అలముకొన్నాయి.
శనివారం (మే23) సాయంత్రం 4గంటలకు రేపాకపల్లికి చెందిన చాగర్ల చంద్రమౌళి (62) పొలం దగ్గర పనిచేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గడ్డి కట్టలకు మంటల వ్యాపించగా మంటలార్పే క్రమంలో చంద్రమౌళికి నిప్పంటుకుంది. దీంతో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. భర్త మరణవార్త విన్న చంద్రమౌళి భార్య భాగ్యం(55) గుండెపోటుతో కుప్పకూలింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలో చనిపోయింది. భార్యభర్తలు అకస్మాత్తుగా కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోవడంతో ఆకుటుంబంతోపాటు రేపాకపల్లిలో తీవ్ర విషాదంలో నెలకొంది.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




