రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలోని పసుమాములలో రెండు రోజుల క్రితం జరిగిన యువకుడు సుహాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును.. పోలీసులు ప్రస్తుతం హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. అర్థరాత్రి దాటిన తర్వాత స్నేహితులే సుహాస్ను ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లారు. ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. ఒక యువతికి సంబంధించిన వ్యవహారం, అలాగే పాత ఆర్థిక వివాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు సుహాస్ను గ్రామ శివారులోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వారి బారి నుంచి తప్పించుకునేందుకు సుహాస్ పరుగు తీసినప్పటికీ, నిందితులు వెంటాడి మరీ పట్టుకుని దారుణంగా హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతరం ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని స్థానిక శ్మశానవాటిక సమీపంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్న కొందరు అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. స్నేహితులే ప్రాణాలు తీశారనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





