హైదరాబాద్ (కేపీహెచ్బీ కాలనీ) హైదరాబాద్లోని కేపీహెచ్బీలో విషాదం చోటుచేసుకుంది. డిప్రెషన్తో తో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కేపీహెచ్బీ ఎస్సై శశిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కానూర్కు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్ భార్యాభర్తలు. ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. పురుషోత్తమన్ ఎస్బీఐలో డీఎంగా పనిచేస్తున్నారు. భార్య, కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి కేపీహెచ్బీ ఆరో ఫేజ్లోని ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో ఉంటున్నారు.
సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో శీతల్ (32) టెర్రస్ ఎక్కే మెట్లపై 10 నిమిషాలు పాటు కూర్చుంది. తర్వాత టెర్రస్ పైకి ఎక్కి అపార్ట్మెంట్ గేటు ఆవరణలోకి దూకేసింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ బలవన్మరణానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఆమె భర్తతో పాటు కేరళలో ఉన్న సోదరుడితోనూ మాట్లాడారు. శీతల్ కొంత కాలంగా డిప్రెషన్తో బాధపడుతోందని.. దీనికి మందులు వినియోగిస్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. కేరళలో ఉన్న శీతల్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





