వినాయక చవితి పండగ సందర్భంగా పలు చోట్ల విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వినాయకుడి మండపంలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి పోయాడు. గంగమ్మ ఆలయానికి సమీపంలోని మండపంలో అశోక్ (32) అలియాస్ లోబో అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న..
ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 10: వినాయక చవితి పండగ సందర్భంగా పలు చోట్ల విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వినాయకుడి మండపంలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి పోయాడు. గంగమ్మ ఆలయానికి సమీపంలోని మండపంలో అశోక్ (32) అలియాస్ లోబో అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అశోక్ పెయింటర్గా పనిచేసేవాడు. విచిత్ర వేషధారణ, కేశాలంకరణలతో వేడుకల్లో నృత్యం చేస్తూ అలరిస్తూ ఉండేవాడు. కాగా అశోక్కు భార్య ఉంది. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. భర్త అకాల మరణంతో మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.
తాజా వార్తలు చదవండి
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





