ఎంత దారుణం.. రైతు ఆశలపై నిప్పులు పోసిన దుండగులు.. కళ్లముందే కాలిబూడిదైన శనగ పంట
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో, ఎవరో చేసిన దుర్మార్గం ఒక రైతు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూరు తండాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
