ఖమ్మం : ఒక్కొక్కరికీ ఒక్కో కథ.. అందరిదీ ఒకటే వ్యథ..కన్నవారు ఎవరో తెలియదు, ఉన్నవారు దగ్గరకు రారు. అలాంటి అభాగ్యులకు తనే ఒడి అయ్యింది. కంటికి రెప్పలా కాపాడే నీడ అయ్యింది. కానీ, కనుమరుగైపోయింది. నీడ ఇప్పుడు శాశ్వతంగా నిద్రలోనే అనంత లోకాలకు..
ఖమ్మం జిల్లా సీసీఎస్ పోలీస్టేషన్ హోంగార్డు ఏనుగుల మంజుల (47) కేవలం యూనిఫాం వేసుకున్న ఉద్యోగి కాదు.. వందలాది మంది అనాథలకు ప్రాణం పోసిన ‘అమ్మ’. ‘అమ్మ అనాథ శరణాలయం’ఏర్పాటు చేసి ఎందరో పిల్లల ఆకలి తీర్చి, వారికి భవిష్యత్తునిచ్చారు. గురువారం సాయంత్రం విధి నిర్వహణ ముగించుకుని ఆశ్రమానికి వచ్చిన మంజుల, ఎప్పటిలాగే పిల్లలతో ముచ్చటించారు. అనంతరం హాల్లోనే నిద్రపోయారు. కానీ, ఆ నిద్ర ఆమెను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్తుందని ఆ పసి ప్రాణాలు ఊహించలేదు.
ఆ గుడ్మార్నింగ్ వినిపించలేదు.. శుక్రవారం ఉదయం ‘అమ్మా.. గుడ్ మార్నింగ్.. లే అమ్మా..’ అంటూ పిల్లలు మంజుల చుట్టూ చేరి పిలిచారు. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో పక్కనే నివసించే మంజుల కూతురికి చెప్పగా.. ఆమె వైద్యుడిని తీసుకొచ్చింది. అప్పటికే మంజుల గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని వైద్యులు చెప్పడంతో చిన్నారులు కన్నీరు మున్నీరయ్యారు. దిక్కెవరు మాకు?: ‘అమ్మా.. ఇప్పుడు మాకు దిక్కెవరు? అంటూ పిల్లలు మృతదేహంపై పడి రోదిస్తుండటం.. అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మంజుల మృతికి పోలీస్ శాఖ నివా ళులు అర్పించగా, ఐసీడీఎస్ అధికారులు పిల్లలను బాలల సదనానికి తరలించారు.
Also read
- పసిపిల్లాడి ప్రాణంతో ఆసుపత్రి సిబ్బంది చెలగాటం.. వైద్యుల నిర్లక్ష్యానికి ఆర్నెళ్ల బాలుడు బలి..!
- మాట్లాడుకుందాం రా అన్న అని పిలిచింది.. ఒంటరిగా వెళ్లాక.. ఏం జరిగిందంటే..
- కళ్ల ముందే ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగిన యువకుడు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో
- లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. రోడ్డున పడ్డ సెక్యూరిటీ గార్డ్ కుటుంబం..!
- నాగర్కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..నిర్వహకుల తీరుతో పసిప్రాణం బలి





