హైదరాబాద్లో ఘోరం జరిగింది. జవహర్నగర్ డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు యూపీ కార్మికులు దుర్మరణం చెందారు. పవర్ ప్లాంట్లో చిమ్నీ అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు
Lift accident: హైదరాబాద్లో ఘోరం జరిగింది. జవహర్నగర్ డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు యూపీ కార్మికులు దుర్మరనం చెందారు. పవర్ ప్లాంట్లో చిమ్నీ అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. మృతులను అమిత్రాయ్ (20), సురేశ్ సర్కార్ (21), ప్రకాశ్ మండల్ (24) గా గుర్తించి పోస్టుమార్టం కోసం పంపించారు.
ఇటీవలే నాంపల్లి నియోజకవర్గంలో మరో ఘటన నగర వాసులను భయభ్రతులకు గురి చేస్తోంది. మురాద్నగర్లోని ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. దీంతో ఫోర్త్ ఫ్లోర్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. చోటి మసీద్ సమీపంలోని నాకో షమ్స్ అపార్ట్మెంట్ ఉంది. దానిలోని ఫోర్త్ ఫ్లోర్లో ఉంటున్న మక్సుద్ ఇంటికి ఆదివారం రాత్రి లంగర్హౌస్లో ఉండే బంధువు సయ్యద్ నసీరుద్దీన్, మైమూనా బేగం, సబీనా బేగం, ముగ్గురు పిల్లలు వచ్చారు. ఫోర్త్ ఫ్లోర్కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. ఫోర్త్ ఫ్లోర్ వరకు వెళ్లిన లిఫ్ట్.. ఒక్కసారిగా కిందికి పడి గ్రౌండ్ ఫ్లోర్లో ఆగింది. లిఫ్ట్లో ఉన్న సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది.
ఖమ్మం జిల్లాకి చెందిన సరోజనమ్మకి ఛాతీ నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో స్టంట్ వేయించుకుంది.ఆపరేషన్ గది నుంచి రూమ్ కి లిఫ్ట్ లో తరలిస్తున్న సమయంలో లిఫ్ట్ పాడైపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది.దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయింది.
Also read
- కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
- మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
- ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్ తో ప్రేమ
- చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయా.. అంత్యక్రియలకు వచ్చి..
- మినీ మహానాడు లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి…..