శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన.
చిల్లకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన వృద్ధుడి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తస్కరించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను దారుణంగా హతమార్చారు. పోలీసుల వివరాల మేరకు.. చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లి గ్రామానికి చెందిన ఏడెం రమణారెడ్డి(84) పశువులను మేపుకొచ్చేందుకు రోజూ మాదిరిగానే ఓడూరు పరిధిలోని పొలాల్లోకి శుక్రవారం ఉదయం వెళ్లారు. సాయంత్రం పశువులు మాత్రమే ఇంటికి వచ్చాయి. రమణారెడ్డి రాకపోవడంతో పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం జామాయిల్ తోటలో ఆయన విగతజీవిగా పడి ఉండటాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి తలపై గాయం ఉండడం,చేతిలోని నాలుగు గ్రాముల బంగారు ఉంగరం మాయం కావడంతో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి బంగారం దొంగిలించినట్లు ప్రాథమికంగా వారు అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
Also read
- Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
- ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
- అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!
- డేటింగ్ యాప్లో పరిచయం..ఎంగేజ్మెంట్తో అసలు గుట్టు రట్టు! కట్చేస్తే పోలీసుల రంగప్రవేశం
- వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?





