అందరూ గుడిలో దేవుడ్ని మొక్కేందుకు వెళ్తుంటే.. వీడు మాత్రం కొంచెం తేడా.. మామూలోడు కాదు.. మహాముదురు. భక్తుడి రూపంలో వెళ్లి ఏకంగా అమ్మవారికే పంగనామాలు పెట్టాడు. గుడిలోకెళ్లి పాడుపని చేస్తే.. సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మీ ఆలయానికి ఓ వ్యక్తి భక్తుడి రూపంలో వచ్చాడు. భక్తితో దేవతకు దణ్ణం పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడే వెనకా ముందు ఎవరూ లేదని చూసి.. వెంటనే గర్భగుడిలోకి వెళ్లి.. అమ్మవారి మెడలో ఉన్న బంగారు తాడును కొట్టేశాడు. దాన్ని జేబులో వేసుకుని.. ఎంచక్కా పరారయ్యాడు. ఇక ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ వ్యక్తి.. గుడిలో పూజారి, మరే భక్తులు లేని సమయంలో ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





