హైదరాబాద్లో మరోసారి భారీ మొత్తంలో మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. విదేశాల నుంచి హైదరాబాద్ అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఏడుగురు ప్రయాణికుల డీఆర్ఐ అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 9.5 కోట్ల విలువైన 27.15 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్ నుండి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఏడుగురు ప్రయాణికులు గంజాయిని అక్రమంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే చెకింగ్ పాయింట్ వద్ద వారి ప్రవర్తణపై అనుమానం రావడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది వారి లగేజ్ను చెక్ చేశారు.
అయితే వారి వద్ద ఉన్న సూట్కేసులలో దాచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సిబ్బంది గుర్తించారు. వెంటనే డీఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొత్తం ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సూట్కేసులో దాచి తరలిస్తున్న సుమారు.27.15 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ బహింర మార్కటెల్లో సుమారు రూ.9.5కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also read
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?
- శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే!





