పెళ్లింట తీవ్ర విషాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Massive Fire | పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్ (Bihar) రాష్ట్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
దర్భంగా ()లోని బహెరా ప్రాంతంలోగల అలీనగర్లో గురువారం రాత్రి 11:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేడుకలో భాగంగా రాత్రి పటాకులు కాల్చారు. ఆ నిప్పు రవ్వలు పెళ్లి పందిరికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. లోపల ఉంచిన కొన్ని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా మండపం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సునీల్ పాశ్వాన్ (26), లీలాదేవి (23), కంచన్ దేవి (26), సిద్ధాంత్ కుమార్ (4), శశాంక్ కుమార్ (3), సాక్షి కుమారి (5)గా గుర్తించారు. అగ్ని ప్రమాదంలో మూడు ఆవులు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- Hyderabad: నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం.. కట్చేస్తే..
- ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టుకుంటూ.. వీడియోలు షూట్ చేసిన మానవ మృగాలు..!
- Telangana: పరీక్షలో ఫెయిలయ్యానని విద్యార్థిని సంచలన నిర్ణయం.. ఏం చేసిందంటే?
- Sri Veereswara Swamy Temple : మీకు పెళ్లి కావట్లేదా..? వెంటనే కోనసీమలో ఉన్న ఈ ఆలయంలో కళ్యాణం చేయించండి..
- జేబులో బోలెడంత డబ్బు.. ఈ మూడు రాశుల వారి ఇంట ధన వర్షమే!





