పెళ్లింట తీవ్ర విషాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Massive Fire | పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్ (Bihar) రాష్ట్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
దర్భంగా ()లోని బహెరా ప్రాంతంలోగల అలీనగర్లో గురువారం రాత్రి 11:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేడుకలో భాగంగా రాత్రి పటాకులు కాల్చారు. ఆ నిప్పు రవ్వలు పెళ్లి పందిరికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. లోపల ఉంచిన కొన్ని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా మండపం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సునీల్ పాశ్వాన్ (26), లీలాదేవి (23), కంచన్ దేవి (26), సిద్ధాంత్ కుమార్ (4), శశాంక్ కుమార్ (3), సాక్షి కుమారి (5)గా గుర్తించారు. అగ్ని ప్రమాదంలో మూడు ఆవులు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- ఈ రెండు చెట్లు ఇంట్లో ఉంటే డబ్బు అస్సలు నిలవదట..! మీ ఇంట్లో ఉన్నాయా..?
- Astrology Tips: మీ తలపై బల్లి పడిందా?.. ఆ పెద్ద మార్పుకు టైమ్ దగ్గరపడినట్టే!
- ఇంట్లో శివలింగం పెట్టేముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే శివదోషం తప్పదట!
- పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం
- ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..





