వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
అమరావతి: వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తానూ ఇబ్బందులు పడ్డానని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ (PV Ramesh) తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో #LandTitling Act హ్యాష్ ట్యాగ్తో ఆయన పోస్ట్ చేశారు.
“నేను ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీవో పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండా తిరిగి ఇచ్చేశారు. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించిన నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం” అని పీవీ రమేశ్ పేర్కొన్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





