కుటుంబంలో నెలకొన్న స్థలవివాదాల నేపథ్యంలో కొందరు తండ్రి వయసు వ్యక్తిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బాపట్ల జిల్లా నగరం మండలం దాసరిపాలెం శివారులో జరిగింది
రేపల్లె : కుటుంబంలో నెలకొన్న స్థలవివాదాల నేపథ్యంలో సొంత బాబాయ్పైనే కొందరు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బాపట్ల జిల్లా నగరం మండలం దాసరిపాలెం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూషయ్య(48), ఆయన ఇద్దరు సోదరుల కుమారులకు మధ్య ఇంటి స్థలం విషయంలో గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. వీటితోపాటు ఇరుకుటుంబాల మధ్య చిన్న మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి భూషయ్యకు, ఆయన సోదరుల కుమారులకు మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తులైన వారు కర్రలతో భూషయ్యపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు జీజీహెచ్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి
చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





