విజయవాడ : ఎపి లోని విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమానుష ఘటన జరిగింది. మహిళల బాత్రూంలోకి ఓ యువకుడు ప్రవేశించి, మహిళలు స్నానాలు చేసే దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడు. ఇది గమనించిన పలువురు మహిళలు కేకలు వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహిళల అరుపులతో అప్రమత్తమైన యాత్రికులు, మహిళా సెక్యూరిటీ సిబ్బంది నిందితుడిని పట్టుకుని, చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని విజయవాడలోని చిట్టినగర్కు చెందిన నరేష్ గా గుర్తించారు. అతని మొబైల్ స్వాధీనం చేసుకుని సేల్ ఫోన్ డేటాను పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- ఆలయంలోని మహిళల బాత్రూంలో చొరబడి రహస్య వీడియోలు రికార్డ్
- Andhra: ఎంతపని చేశావ్ మానస.. బాయ్ఫ్రెండ్ చెప్పినట్లు చేసింది.. చివరకు
- అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా సెక్రటేరియట్ లోపలికి వెళ్లాడు.. సీన్ కట్ చేస్తే..
- తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి.. ఎందుకంటే..
- నేటి జాతకములు..30 ఏప్రిల్, 2026





