విజయవాడ : ఎపి లోని విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమానుష ఘటన జరిగింది. మహిళల బాత్రూంలోకి ఓ యువకుడు ప్రవేశించి, మహిళలు స్నానాలు చేసే దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడు. ఇది గమనించిన పలువురు మహిళలు కేకలు వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహిళల అరుపులతో అప్రమత్తమైన యాత్రికులు, మహిళా సెక్యూరిటీ సిబ్బంది నిందితుడిని పట్టుకుని, చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని విజయవాడలోని చిట్టినగర్కు చెందిన నరేష్ గా గుర్తించారు. అతని మొబైల్ స్వాధీనం చేసుకుని సేల్ ఫోన్ డేటాను పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..





