పరకాల: గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ ఆర్ఎంపీ, మాజీ సర్పంచ్ ఇళ్ల ఎదుట మృతుల ఎముకలతో క్షుద్రపూజలు చేశారు. ఈ ఘటన పరకాల మండలం వెంకటాపురంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ సదన్కుమార్, ఇంటి ముందుతో పాటు మాజీ సర్పంచ్ ఇనుగాల రమేష్ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న తరుణంలో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి క్షుద్రపూజలు చేశారు.
చాలా చోట్ల క్షుద్రపూజలలో కోళ్లు, మేకలకు సంబంధించిన తలలు, కోడిగుడ్లు వాడుతుండగా వెంకటాపురంలో జరిగిన క్షుద్రపూజల్లో శ్మశాన వాటిక నుంచి కుండల్లో తీసుకొచ్చిన మృతుల ఎముకలను కాల్చి పసుపు, కుంకుమతో పాటు చాటలను వారి ఇళ్ల ఎదుట ఏర్పాటు చేశారు. దీంతో ఊరికి వెళ్లి వచ్చి సరికే ఇళ్ల ఎదుట క్షుద్ర పూజలు చేసి ఉండడంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోకి వెళ్లడానికి కూడా సాహసించలేక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో క్షుద్రపూజలు జరిగాయా? లేక భయపెట్టేందుకు ఎవరైనా ఆకతాయిలు కావాలనే నాటకం ఆడారా? అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also read
- కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..
- Vizianagaram: ప్రశాంత జిల్లాను కలవరపాటుకు గురిచేసిన సిరాజ్ నేపద్యం ఏంటి?
- Palndau District: పల్నాడులో ప్రాణాలు తీసిన ఆధిపత్య పోరు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య
- హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయా? డీజీపీ స్టేట్మెంట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
- Hyderabad: పండుటాకులకు పెళ్లి సంబంధాలు చూస్తామని.. పళ్లాలు బోర్లించారు