Hyderabad News: హైదరాబాద్ నగరంలో మరోసారి వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. గౌలిదొడ్డిలోని టీఎన్జీవో కాలనీలో విదేశీ యువతులతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad: హైదరాబాద్లోని (Hyderabad) గచ్చిబౌలి ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టైంది. విదేశీ యువతులను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తోన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌలిదొడ్డిలోని టీఎన్జీవో కాలనీలో పారిన్ అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా.. పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ, హెచ్టీఎఫ్ అధికారులు దాడులు చేశారు. కెన్యా, బ్యాంకాక్, టాంజానియాకు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 9 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలోనే వ్యభిచారం గృహం నిర్వాహకులు పరారీ కాగా వారి కోసం గాలింపు చేపట్టారు. ఆన్ లైన్ ద్వారా ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేస్తున్నారు.
Also read
- అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
- బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?
- షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..!
- ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
- నిడదవోలు నియోజకవర్గం – పట్టణ వివిధ వార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం





