నంద్యాల ఎన్జీవో కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. శిరీష అనే మహిళను ఆమె భర్త సాయినాథ శర్మ గొంతుకోసి చంపేశాడు. ఆర్థిక ఇబ్బందులు, భార్యపై అనుమానమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కత్తితో భార్య కడుపులో, మెడపై పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు
నంద్యాల(nadyala) ఎన్జీవో కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. శిరీష అనే మహిళను ఆమె భర్త సాయినాథ శర్మ గొంతుకోసి చంపేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు, భార్యపై అనుమానమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఎన్జీఓ కాలనీలో సాయినాథశర్మ, శిరీష దంపతుల నివాసం ఉంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులు(Financial Issues), కుటుంబ కలహాలతో నిత్యం గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సాయినాథ శర్మ నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కత్తితో భార్య కడుపులో, మెడపై పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్కు వెళ్లిన భర్త.. సైలెంట్గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





