పెద్దతిప్పసముద్రం, : మద్యానికి బానిసైన ఓ భర్త.. తల్లికి వందనం డబ్బుల కోసం భార్యను హత్యచేసిన ఘటన అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని మల్లెల గ్రామానికి చెందిన రమాదేవి(27)కి బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన సురేశ్తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరూ కూలీలే. మూడు నెలల క్రితం వారు గొడవ పడటంతో పిల్లలను రమాదేవి తన తల్లిదండ్రుల దగ్గర ఉంచింది. గురువారం సురేశ్ మద్యం తాగి ఇంటికొచ్చి.. ప్రభుత్వం అందించిన తల్లికి వందనం డబ్బులు ఇవ్వాలంటూ భార్యతో గొడవకు దిగాడు. ఆమె నిరాకరించడంతో రమాదేవిపై కత్తితో దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతిచెందింది. అనంతరం సురేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





