నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్లో ఒక ప్లాట్కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.4 లక్షలు లంచం తీసుకోవడంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణిగా ఉన్న మణిహారిక ఏసీబీ వలలో పడింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్లో ఒక ప్లాట్కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వినోద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Also read
- Hyderabad: అమ్మాయిల అదృశ్యం వెనుక ఆ గేమ్స్.. తల్లిదండ్రులారా జాగ్రత్త..!
- లేడీస్ హాస్టల్లో అపస్మారక స్థితిలో యువతి.. ఆసుపత్రికి తీసుకెళ్లగా..
- వైజాగ్ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో సరికొత్త ట్విస్ట్.. పోలీసుల తీరుపై తండ్రి సంచలన ఆరోపణలు!
- రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్: కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
- దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!





