వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార నేతల పేరుతో పల్నాడు జిల్లా మాచవరం హెడ్కానిస్టేబుల్ డబ్బు వసూళ్లకు పాల్పడ్డారని పిన్నెల్లి వాసి, తెదేపా సానుభూతి పరుడు షేక్ సత్తార్ ఆరోపించారు.
మాచవరం: వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార నేతల పేరుతో పల్నాడు జిల్లా మాచవరం హెడ్కానిస్టేబుల్ డబ్బు వసూళ్లకు పాల్పడ్డారని పిన్నెల్లి వాసి, తెదేపా సానుభూతి పరుడు షేక్ సత్తార్ ఆరోపించారు. గ్రామంలో ఉండాలంటే రూ. లక్ష కట్టాలని హెడ్ కానిస్టేబుల్ నాగేండ్ల అశోక్ బాబు బెదిరించాడని, భయంతో ఆయనకు డబ్బు ఇచ్చానని షేక్ సత్తార్ తెలిపారు. గత ప్రభుత్వంలో వైకాపా నేతలకు అనుకూలంగా ఉంటూ అశోక్బాబు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటీవల మాచవరం నుంచి వెల్దుర్తికి బదిలీ అయిన హెడ్ కానిస్టేబుల్ అశోక్బాబు నుంచి డబ్బు ఇప్పించాలని పోలీసు అధికారుల్ని కలిసి విన్నవించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే మార్గమని వాపోయాడు.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





