వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార నేతల పేరుతో పల్నాడు జిల్లా మాచవరం హెడ్కానిస్టేబుల్ డబ్బు వసూళ్లకు పాల్పడ్డారని పిన్నెల్లి వాసి, తెదేపా సానుభూతి పరుడు షేక్ సత్తార్ ఆరోపించారు.
మాచవరం: వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార నేతల పేరుతో పల్నాడు జిల్లా మాచవరం హెడ్కానిస్టేబుల్ డబ్బు వసూళ్లకు పాల్పడ్డారని పిన్నెల్లి వాసి, తెదేపా సానుభూతి పరుడు షేక్ సత్తార్ ఆరోపించారు. గ్రామంలో ఉండాలంటే రూ. లక్ష కట్టాలని హెడ్ కానిస్టేబుల్ నాగేండ్ల అశోక్ బాబు బెదిరించాడని, భయంతో ఆయనకు డబ్బు ఇచ్చానని షేక్ సత్తార్ తెలిపారు. గత ప్రభుత్వంలో వైకాపా నేతలకు అనుకూలంగా ఉంటూ అశోక్బాబు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటీవల మాచవరం నుంచి వెల్దుర్తికి బదిలీ అయిన హెడ్ కానిస్టేబుల్ అశోక్బాబు నుంచి డబ్బు ఇప్పించాలని పోలీసు అధికారుల్ని కలిసి విన్నవించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే మార్గమని వాపోయాడు.
Also read
- విహారయాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన నవ వధువు.. హోమ్స్టేలో రక్తపు మడుగులో మృతి
- నిజ జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం- ఈ నెలలో వచ్చే పర్వదినాలు, పుణ్య తిథులు ఇవే!
- Garuda Purana : అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..




