SGSTV NEWS
CrimeNational

Crime News: ఆశ్రమ పాఠశాలలో గర్భందాల్చిన బాలికలు.. మందు, సిగరెట్లతోప్రధానోపాధ్యాయుడు దారుణం!

Crime News: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల దురవస్థ మరోసారి వెలుగులోకి వచ్చింది. మీర్జాపూర్ జిల్లాలోని మదిహాన్ తహసీల్ పరిధిలో ఉన్న జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ బాలికల ఆశ్రమ పాఠశాలలో సంచలనకర ఆరోపణలు బయటపడ్డాయి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు నీలం ప్రభాత్ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థినుల నుంచి ఎదురైన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. ఆమె ఆదేశాల మేరకు ముగ్గురు అధికారుల దర్యాప్తు బృందం పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. విచారణ సందర్భంగా.. విద్యార్థినులు వెల్లడించిన విషయాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి.

బాలికలు గర్భవతులు కావడం..
విద్యార్థినుల ప్రకారం.. పాఠశాలలో కొందరు బాలికలు గర్భవతులు కావడం, వారికి గర్భధారణ పరీక్షలు నిర్వహించడం జరగినట్లు తెలుస్తోంది. ఇది విద్యా సంస్థల్లో చోటు చేసుకోకూడని అగ్రహణీయమైన విషయం. ఇంకా విద్యార్థినుల శానిటరీ ప్యాడ్స్‌ను స్కూల్ సిబ్బంది తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు గుట్కా తింటూ, సిగరెట్ తాగుతూ విద్యార్థినులపై పొగ ఊదేవాడిగా ఆరోపణలు వచ్చాయి. ఉపాధ్యాయినులు మద్యం సేవిస్తూ క్లాస్‌రూమ్‌లోనే నిద్రించేవారట. విద్యార్థినులపై వారి చూపిస్తున్న నిర్లక్ష్యం, అసభ్య ప్రవర్తన, శిక్షణలో లోపాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

విద్యార్థినుల ఫిర్యాదులతో కూడిన నివేదికను దర్యాప్తు బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పంపించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. బాలికల భవిష్యత్తుతో ఆటలాడే అలాంటి అక్రమ వ్యవస్థలను రక్షణ కల్పించకుండా కూల్చివేయాలంటున్నారు. విద్యార్థుల భద్రత, హక్కులు అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించాలని వారు కోరుతున్నారు.

Also read

Related posts

Share this