SGSTV NEWS
NationalViral

10th Class Students: ఆన్సర్ షీట్లో రూ.500.. ఛాయ్‌ తాగి నన్ను పాస్‌ చేయండి – 10th క్లాస్ స్టూడెంట్స్ అరాచకం


సార్ ఈ రూ.500లతో ఛాయ్ తాగి నన్ను పాస్ చెయ్యండి అంటూ ఓ విద్యార్థి తన 10 క్లాస్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్లో రాసుకొచ్చిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పేపర్లు మూల్యాంకనం చేస్తున్న సమయంలో ఇన్విజిలేటర్లకు ఆన్సర్ షీట్‌లో డబ్బులు దొరికాయి. అవి చూసి షాకయ్యారు.

కర్ణాటక రాష్ట్రం బెల్గావి జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన కొందరు విద్యార్థులు ఆన్సర్‌ షీట్లలో డబ్బులు పెట్టి.. తమను పాస్ చేయమని ఇన్విజిలేటర్లను కోరిన ఘటన సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిక్కోడిటౌన్‌లో ఇటీవల పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ పరీక్షల పేపర్ల మూల్యాంకనం ఆఖరికి చేరుకుంది. ఇందులో భాగంగానే ఇన్విజిలేటర్లు పరీక్ష పేపర్లను కరెక్షన్ చేస్తున్న  సమయంలో ఆన్సర్ షీట్లలో కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఇన్విజిలేటర్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పరీక్ష పేపర్లలో కరెన్సీ నోట్లు ఎలా వచ్చాయి..? ఎందుకు వచ్చాయి? అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

నా ప్రేమను కొనసాగిస్తా
కొందరు విద్యార్థులు తమను పాస్ చేయాలని కోరుతూ అందులో డబ్బులు పెట్టారు. మరికొందరు తమ ప్రేమను గెలిపించమని కోరుతూ ఆన్సర్స్ షీట్లలో డబ్బులు పెట్టారు.  అందులో ఒకరు.. ప్లీజ్‌ సార్ నన్ను పాస్‌ చేయండి.. నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది సార్.. నేను పాసైతే నా ప్రేమను ముందకు కొనసాగిస్తా అంటూ ఆన్సర్ షీట్లో రాసుకొచ్చారు

రూ.500 తీసుకుని పాస్ చెయ్యండి
మరికొందరు.. సార్‌ ఇదిగో రూ.500 ఛాయ్‌ తాగి పాస్‌ చేయండి అంటూ తెలిపారు. ఇంకొందరు.. నేను పాసవ్వకపోతే మా పేరెంట్స్ నన్ను కాలేజీకి పంపియ్యరు అంటూ ఆన్సర్ షీట్లలో రాసుకొచ్చారు. చివరికి ఆ ఆన్సర్ షీట్లలోని డబ్బులను ఉన్నతాధికారులకు అందించారు ఇన్విజిలేటర్లు.

Also read

Related posts

Share this