శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో దారుణం జరిగింది. గొల్లపేటకు చెందిన భవాని అనే వివాహితను గుర్తుతెలియని వ్యక్తి గొంతు కోసి చంపాడు. నిన్న సాయంత్రం రోడ్డుపై నడిచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Srikakulam: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరంలో మరో దారుణం వెలుగు చూసింది. శనివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు వివాహిత గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. ఆమె రోడ్డుపై నడిచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతురాలిని గొల్లపేట గ్రామానికి చెందిన భవనీగా గుర్తించారు. అయితే వివాహేత సంబంధమే ఆమె హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు భవానీ చంపింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్త్తు చేస్తున్నారు.
ఇటీవలే మహారాష్ట్రలో
ఇదిలా ఇటీవలే మహారాష్ట్రాలో మరొ దారుణం జరిగింది. థానే జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళ(35)ను గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. కొద్దిరోజుల క్రితం ఆమె బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
సమీపంలోని వ్యక్తుల సహాయం..
ఈ మేరకు ఆ మహిళ వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం శుక్రవారం భివాండిలోని ఠాకూర్గావ్ ప్రాంతంలో లభ్యమైందని చెప్పారు. మరణించిన మహిళను ఇంకా గుర్తించలేదని, ఆ మహిళను గుర్తించడానికి సమీపంలోని వ్యక్తుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నామని, గత కొన్ని సంవత్సరాల కిందట ఆమె తప్పిపోయినట్లు దాఖలైన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తున్నామన్నారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





