శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో దారుణం జరిగింది. గొల్లపేటకు చెందిన భవాని అనే వివాహితను గుర్తుతెలియని వ్యక్తి గొంతు కోసి చంపాడు. నిన్న సాయంత్రం రోడ్డుపై నడిచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Srikakulam: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరంలో మరో దారుణం వెలుగు చూసింది. శనివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు వివాహిత గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. ఆమె రోడ్డుపై నడిచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతురాలిని గొల్లపేట గ్రామానికి చెందిన భవనీగా గుర్తించారు. అయితే వివాహేత సంబంధమే ఆమె హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు భవానీ చంపింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్త్తు చేస్తున్నారు.
ఇటీవలే మహారాష్ట్రలో
ఇదిలా ఇటీవలే మహారాష్ట్రాలో మరొ దారుణం జరిగింది. థానే జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళ(35)ను గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. కొద్దిరోజుల క్రితం ఆమె బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
సమీపంలోని వ్యక్తుల సహాయం..
ఈ మేరకు ఆ మహిళ వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం శుక్రవారం భివాండిలోని ఠాకూర్గావ్ ప్రాంతంలో లభ్యమైందని చెప్పారు. మరణించిన మహిళను ఇంకా గుర్తించలేదని, ఆ మహిళను గుర్తించడానికి సమీపంలోని వ్యక్తుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నామని, గత కొన్ని సంవత్సరాల కిందట ఆమె తప్పిపోయినట్లు దాఖలైన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తున్నామన్నారు.
Also read
- నేటి జాతకములు…22 మే, 2025
- Garuda Purana: అల్లుడితో సంబంధం పెట్టుకునే అత్తకు గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్షలు విధిస్తారంటే
- ‘నీ బిడ్డనిచ్చి పెళ్లి చెయ్’ – సహజీవనం చేసిన మహిళకు వ్యక్తి బెదిరింపులు
- కోర్టు సినిమా తరహాలో కడపలో రియల్ సీన్ సంచలనం.. పోలీసుల సమక్షంలోనే..
- Vizianagaram Case: విజయనగరం టెర్రర్ కేసులో మరిన్ని సంచలనాలు