నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ ఫెన్సింగ్ వేసి అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవాలనుకున్న రైతు కుటుంబం విద్యుత్ఘాతంతో చనిపోయింది. కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్కు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కొడుకు మృతి చెందారు.
విద్యుత్షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో చోటుచేసుకుంది. గంగారం అనే రైతు పంట చేలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. వాటి నుంచి పంటను రక్షించుకోడానికి కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో పొలం దగ్గర బోరు మోటర్ కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్కు గురైయ్యారు. దీంతో రైతు, ఆయన భార్య బాలమణి, వారి కొడుకు కిషన్ అక్కడిక్కడే చనిపోయారు.
ఒకే కుటుంబానికి మగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. బంధువులు తీవ్రం విషాదంలో ముగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





