హైదరాబాద్: నగరంలోని బడంగ్్పట్లో పేలుడు సంభవించింది. గుర్తుతెలియని పదార్థం పేలడంతో అనూప్ (43) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పేలుడు తీవ్రతకు అతడి శరీరభాగాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ఇటీవల కోల్కతా నుంచి పనుల కోసం అనూప్ హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటన్న వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- చిత్తూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
- ఫ్రిజ్ వాటర్ వెంటనే తేలేదని.. కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు
- అర్ధరాత్రి ఆలయ ప్రాంగణం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు.. ఫిర్యాదులో పోలీసులు వెళ్లి చూడగా
- బడంగ్ పేట్లో పేలుడు.. వ్యక్తి మృతి
- నరసాపురంలో మహిళ దారుణహత్య





