SGSTV NEWS online
Andhra PradeshCrime

డాక్టర్ ప్రియాంక మరణంపై హత్య కేసుగా నమోదు చెయ్యాలి KVPS డిమాండ్

నిడదవోలు… రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ గేట్ వద్ద ఆగస్ట్3వ తేదీ రాత్రి GSL మెడికల్ కాలేజీ లో డెర్మటాలజీలో PG తొలి సంవత్సరం చదువుతున్న డాక్టర్ ప్రియాంక పై మద్యం సేవించిన ఇద్దరు యువకులు సురవరపు దశ్వంత్. ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ అనే వాళ్ళు ప్రియాంక స్కూటీ పై వెళుతుండగా కారుతో ఢీ కొట్టిన దారుణ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని KVPS నాయకులు జువ్వలరాంబాబు డిమాండ్ చేస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు ఈ దారుణ ఘటనను ఖండిస్తూ KVPS ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ స్థితిలో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ప్రియాంక పై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని రాంబాబు డిమాండ్ చేశారు నిందితులు పలు మార్లు వాహనంతో విపరీతంగా మద్యం సేవించి ఉన్న వారు పలు మార్లు కారుతో ఢీ కొట్టినట్లుపుటేజ్ దృశ్యాలు బట్టి తెలుస్తుంది నిందితులపైకఠిన చర్యలు తీసుకోవాలని ఘటన జరిగి 3రోజులు తర్వాత ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పలు అనుమానాలు వస్తున్నాయని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని రాంబాబు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సూర్య కుమారి. ఉమా. దుర్గా. దేవీ నాగమణి. వరలక్ష్మీ. యేసు రత్నం. వెంకట లక్ష్మీ. టి చిరంజీవి B నాగేశ్వర రావు భవాని నారాయణ తదితరులు పాల్గొన్నారు

Alsi read

Related posts