కారులో ఆడుకుంటున్న బాలుడు డోర్ లాక్ పడి ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
నంద్యాల జిల్లా డోన్ లో విషాదం
డోన్ : కారులో ఆడుకుంటున్న బాలుడు డోర్ లాక్ పడి ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. డోన్ మండలం దొరపల్లె గ్రామానికి చెందిన మోహన్, ధనలక్ష్మి దంపతుల మూడో కుమారుడు ఈశ్వర్(11) బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన బంధువుల కారులోకి ఎక్కగానే ఒక్కసారిగా డోర్ లాక్ పడింది. కారు లాక్ తెరవడం రాక, చాలాసేపు కాళ్లతో చేతులతో అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అద్దాలు పగలకపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈశ్వర్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. సుమారు మూడు గంటల తర్వాత బాలుడు కారులో ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
Also read
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న